రంగారెడ్డి జిల్లాలో విషాదం. ప్రాణం తీసిన ఐపీఎల్!
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యువతని అలరించాల్సిన ఐపీఎల్ ఓ యువకుడి ప్రాణం తీసింది. కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన అంగోతు ప్రకాష్ అనే యువకుడు ఐపీఎల్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ పై కూడా పంజాబ్ గెలుస్తుందంటూ బెట్టింగ్ వేశాడు.
కానీ ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలవడంతో సరదాగా వేసిన బెట్ట్ ప్రకాష్ ప్రాణాలు తీసింది. బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలని ప్రకాష్ ను బలవంతం చేయడంతో.. డబ్బులు కట్టే పరిస్థితిలో లేని ప్రకాష్ మానసిక ఒత్తిడికి లోనై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు తీరని లోటును మిగిల్చాడు.