in ,

వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం

వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం

 

వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సన్నిహితులు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే ఆంద్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా దేవనగర్ కు చెందిన ఖాదర్ అనే వ్యక్తి వ్యాపారం కోసం వైసీపీ నాయకుల దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అయితే మొదట్లో కలిసి వ్యాపారం చెద్దామని మాటలతో సొంత వాళ్ళల కలిసిపోయిన వైసీపీ నాయకులు ఖాదర్ కు వ్యాపారంలో నష్టం రావడంతో పగవారైపోయారు. తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వమని వేధించడం మొదలు పెట్టారు. వెంటనే ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన ఖాదర్ ఏమి చేయాలో తెలియక ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.

సన్నిహితులు ఖాదర్ వెంటనే ఆసుపత్రికి తరలించి అతని ప్రాణాలు కాపాడారు.
ఖాదర్ సోదరి మీడియాతో మాట్లడుతూ వైసీపీ నాయకులు కావాలనే పిలిచి మరీ డబ్బిచ్చి వ్యాపారం చేద్దామన్నారని.. కానీ వ్యాపారంలో నష్టం వచ్చే సరికి డబ్బు తిరిగి ఇచ్చేమని వేధించి ఖాదర్ ప్రాణాలు తీసుకునే స్థితికి తీసుకువచ్చారని చెప్పుకొచ్చింది.

అతని సన్నిహితులు మాట్లాడుతూ ఖాదర్ ను చాలా కాలం నుంచి వైసీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని.. పోలీసులు కూడా వారికి సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. దయచేసి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా కోరారు.

What do you think?

ప్రభాస్ సినిమా కోసం 5 వేల కిలో మీటర్ల ప్రయాణం

ఆఫ్రికా రెండుగా చీలిపోతుంది – శాస్త్రవేత్తలు