in ,

జనసేనలో చేరనున్న వైసీపీ నేత పంచకర్ల రమేష్‌బాబు

జనసేనలో చేరనున్న వైసీపీ నేత పంచకర్ల రమేష్‌బాబు

ఓ వైసీపీ నేత జనసేనలో చేరనున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని పవన్ సమక్షంలో ప్రకటించనున్నారు.

వివరాల్లోకి వెళ్తే వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఇప్పుడు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జులై 20న తన అనుచరులతో కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతానని ప్రకటించిన ఆయన రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్‌ కళ్యాణ్ వెంట నడవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పవన్‌ కళ్యాణ్ ప్రజల కోసం పడుతున్న తపన తనను కదిలించిందని అందుకే ఈ సినిమా నిర్ణయం తీసుకున్నానని అన్నారు. పార్టీలో ఆయనకు ఎటువంటి బాధ్యత అప్పగించినా వంద శాతం నిబద్ధతతో నిర్వహిస్తానని పంచకర్ల రమేష్‌బాబు స్పష్టం చేశారు.

What do you think?

ఓ హిజ్రా రూ.6 కోట్లతో పారారయ్యింది

జగనన్న తోడు నిధులను విడుదల చేసిన- సీఎం జగన్‌