జగనన్న తోడు నిధులను విడుదల చేసిన- సీఎం జగన్
జగనన్న తోడు నిధులను సీఎం జగన్ నేడు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాల వారికి రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించారు. చిరు వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ.10,000 రుణం అందజేశారు. ఈ రుణాన్ని ప్రతి నెలా కిస్తీ రూపంలో సకాలంలో చెల్లించే వారికి ఆ రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. ఇంతవరకూ 15.87 లక్షల మంది చిరువ్యాపారులకు రూ. 2,955.79 కోట్ల రుణాలు ఇచ్చారు. అయితే వీరిలో రుణాన్ని చెల్లించి తిరిగి రుణాలు పొందిన వారు దాదాపుగా 13.29 లక్షల మంది ఉండడం విశేషం.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇటువంటి మంచి పని చేసే కార్యక్రమం దేశం ఎక్కడా లేదని అన్నారు. అందరూ కలిసి కట్టుగా ఒకటైతే ఇటువంటి మంచి పని సాధ్యం అవుతుందని అన్న జగన్ ఇది సాధ్యం అయ్యేలా చేసిన గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థ, మెప్మా వ్యవస్థలకు, బ్యాంకర్లకు కృతజ్ఞతలు తెలిపారు.