జనసేన,టీడీపీ,బీజేపీలు ఏకం కావాలి – పవన్ కళ్యాణ్
రానున్న ఎన్నికల్లో జనసేన,టీడీపీ, బీజేపీ పార్టీలు కలసి పోటీ చేసే అవకాశాలు లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అందరూ కలసి పోరాడి వైఎస్సార్ సీపీని గద్దె దించాలని అన్నారు.
ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో అక్కడి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ సీపీని (ysrcp) ఎదుర్కోవాలంటే జనసేన, టీడీపీ, బీజేపీలు ఏకం కావాలని.. కలిసే అవకాశం కూడా ఉందని అన్నారు. అందరూ కలసి పోరాడి వైఎస్సార్ సీపీని గద్దె దించాలని అన్నారు. తనకు సీఎం పదవి ముఖ్యం కాదని తెలిపిన పవన్ ఎన్నికల తర్వాత ఎవరనేది నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారు.