ఈ నెల 27న రైతులకు అందనున్న పీఎం కిసాన్ యోజన
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ యోజన 14వ విడత నిధులు ఈ నెల 27న రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజస్తాన్లోని సీకర్లో జరిగే రైతు సభలో ప్రధాన మంత్రి మోదీ ఈ నిధులు విడుదల చేయనుండగా.. దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మంది రైతులు ఈ నిధులు అందుకోనున్నారు. ప్రతి రైతు ఖాతాలో రూ.2 వేల చొప్పున డబ్బులు జమ కానున్నాయి. రైతులు తమ ఖాతాల్లో డబ్బు జమ అయ్యిందో లేదో తెలుసుకోవలాంటే https://pmkisan.gov.in/ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.