80 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక సదుపాయం కల్పించనుంది. వచ్చే ఎన్నికల నుంచి 80 ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్ పద్దతిలో ఓటు వేసే అవకాశం కల్పించింది.
ఇందుకోసం పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు ముగిశాక ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటి వరకు ఎన్నికల విధులు, సాయుధ బలగాలకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంది.