కేరళ వ్యక్తికి లాటరీ రూపంలో రూ. 25 కోట్ల జాక్ పాట్
కేరళకు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతను రూ. 500 పెట్టి తీసిన లాటరీకి రూ.25 కోట్ల జాక్ పాట్ తగిలింది.
వివరాల్లోకి వెళ్తే ఓనం సందర్భంగా కేరళ లాటరీ డిపార్ట్మెంట్ లాటరీ టికెట్స్ జారీ చేసింది. ఆ సమయంలో తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన నటరాజ్ అనే వ్యక్తి రూ.500 పెట్టి టికెట్ కొనుగోలు చేశాడు.
కాగా ఈ బుధవారం కేరళ లాటరీ డిపార్ట్మెంట్ లక్కీ డ్రా తీయగా.. నటరాజ్ కు ఏకంగా రూ.25 కోట్ల జాక్ పాట్ తగిలింది. అందులో ట్యాక్సులు పోనూ అతనికి రూ.17.5 కోట్లు ఇవ్వనున్నారు. దీంతో ఇలా రాత్రికి రాత్రే జాక్ పాట్ తగలడంతో నటరాజ్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.