వణికిస్తున్న ‘స్క్రబ్ టైఫస్’.. 211కి చేరిన కేసులు
ఒడిశాలో ‘స్క్రబ్ టైఫస్’ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ శుక్రవారం మరో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య 211కి చేరింది.
ఒక వైపు స్క్రబ్ టైఫస్ ఇలా వేగంగా విజృంభిస్తుండడం, మరో వైపు దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కేసులు పెరగడంపై ప్రజల్లో ఆందోళన పెరిగింది.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు, జిల్లా యంత్రాంగానికి దీన్ని అరికట్టడం పెను సవాల్గా మారింది.