టీఎస్పీఎస్సి పేపర్ లీక్ కథలో కొత్త మలుపు.
టీఎస్పీఎస్సి పేపర్ లీక్ కేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా వరంగల్ జిల్లాకి చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు బయటకొచ్చింది.
కొన్ని నెలలుగా సాగుతున్న టీఎస్పీఎస్సి పేపర్ లీక్ కథ కొత్త మలుపు తిరిగింది. తాజాగా వరంగల్ జిల్లాకి చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు బయటకొచ్చింది.
ఇప్పటికే ఈ కేసులో విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవి కిషోర్ను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేయగా.. ఇప్పుడు సదరు విద్యుత్ శాఖ డీఈ కనుసున్నల్లో పెద్ద ఎత్తున ఏఈ పేపర్లు చేతులు మారినట్లు తెలిసింది. ఇప్పటి వరకు 43 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వారిని విచారించి ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.