ఒక ప్రమాదం మరువక ఇంకో ప్రమాదం. రైలు కింద నలిగి..
మొన్నటి రైలు ప్రమాదాన్ని మరువక ముందే ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే ఒడిశాలోని ఝూజ్పూర్ అనే ఓ రైల్వేస్టేషన్లో ఇంజిన్ లేని గూడ్స్ రైలు నిలిపి ఉంది. అక్కడ వర్షం పడటంతో కార్మికులు గూడ్స్ బోగీల కిందకు వెళ్లి తలదాచుకున్నారు. అయితే రైలు బోగీలు ఒక్కసారిగా ఈదురుగాలులు రావడంతో కదిలాయి. దీంతో ఆ బోగీల కింద తల దాచుకున్న ఆరుగురు కార్మికులు చక్రాల కింద నలిగిపోయారు. ఇంకొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కటక్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.