కోర్టులో జడ్జి ముందే గ్యాంగ్స్టర్ ని కాల్చేశారు!
జడ్జి కళ్లెదుటే ఓ గ్యాంగ్స్టర్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్స్టర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన యూపీలోని లక్నోలో ఉన్న సిటీ సివిల్ కోర్టులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే సంజీవ్ జీవన్ అలియాస్ జీవా అనే వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ లో పేరు మోసిన గ్యాంగ్స్టర్. ఇతనికి ముక్తార్ అన్సారి, మున్నా బజ్రంగి గ్యాంగ్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాగా సంజీవ్ జీవన్ కొన్ని రోజులుగా ఓ కేసు నిమిత్తం లక్ నౌ లోని జైల్లో ఖైదీగా ఉంటున్నాడు.
2005 లో గాజీపూర్ డిస్ట్రిక్ట్ లోని మొహమ్మదాబాద్ సిట్టింగ్ ఎంఎల్ఏ రాయ్ ని కొంత మంది దుండగులు ఏకే – 47 అసాల్ట్ రైఫిల్స్ తో కాల్చి చంపారు. ఈ ముర్డర్ లో ముక్తార్ అన్సారి, మున్నా బజ్రంగిలతో పాటు జీవా కూడా కుట్రదారులలో ఒకడని అనుమానాలు ఉన్నాయి.
2018 లో బగ్పాత్ జైల్లో ఉన్న మున్నా బజ్రంగిని జైలు లోపలే చంపేయడంతో తనకు ప్రాణ హాని ఉందని జీవా పేర్కొన్నాడు. దీంతో అతనకి ఎంఎల్ఏ రాయ్ చావుకు సంబంధం ఉందన్న అనుమానాలు నిజమేనని వెల్లడైంది.
అయితే, జూన్ 7 బుధవారం ఓ కేసు నిమిత్తం సంజీవ్ జీవాను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.ఈ క్రమంలో జడ్జి విచారణ జరుపుతుండగా కొంతమంది దుండగులు లాయర్ల దుస్తుల్లో వచ్చి అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంజీవ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనలో కొంత మంది పోలీసులకు, ఓ ఆరేళ్ల చిన్నారికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.
కాల్పులు జరిపిన దుండగులలో విజయ్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారించి విషయం రాబట్టే పనిలో ఉన్నారు. అయితే ఈ ఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.