మైనర్ బాలిక నిక్కీ హత్య కేసులో ఎట్టకేలకు చిక్కిన నిందితుడు.
16 ఏళ్ల మైనర్ బాలిక నిక్కీ హత్య కేసు నిందితుడు సాహిల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. యూపీలోని బులంద్షహర్ ప్రాంతంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని రోహిణీలో నివసించే నిక్కీ అనే 16 ఏళ్ల మైనర్ బాలికను సాహిల్ అనే 20 ఏళ్ల యువకుడు 40 సార్లు కత్తితో పొడిచాడు. అక్కడితో ఆగకుండా బండరాయితో మోది చంపాడు.
అయితే ఇప్పుడు సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడైన సాహిల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడిని యూపీలోని బులంద్షహర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు సాహిల్ ఏసీ మెకానిక్గా పని చేస్తున్నట్లు సమాచారం.
ఆయితే అసలు ఈ హత్యకు కారణం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.