బిడ్డను విసిరేస్తామని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన కామాంధులు
ఓ మహిళపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన అస్సాం సిఫాంగ్ ఎక్స్ప్రెస్ రైలులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే ఓ స్టేషన్లో బాధిత మహిళ బిడ్డతో కలిసి అస్సాం సిఫాంగ్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కింది. అయితే రైలు ఫకీరాగ్రామ్ వచ్చేసరికి బోగీ ఖాళీ అయిపోయింది. దీంతో ఇదే అదునుగా చూసిన కొందరు కామాంధులు రెచ్చిపోయి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. తమకు సహకరించకపోతే ఆమె బిడ్డను నడుస్తున్న రైలు నుంచి భయటకు విసిరేస్తామని బెదిరించి దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన అనంతరం బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే నింధితులను అరెస్ట్ చేశారు.