వారికి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్న సీఎం జగన్
సీఎం జగన్ మహిళలకు, రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అదించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన రైతులు, మహిళలు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడుతుందన్నారు. అందుకే స్వయం ఉపాధి, వ్యవసాయం వంటి కార్యక్రమాల ద్వారా వారిని ఆదుకోవాలని అన్నారు. ఆర్బీకేలు, సొసైటీ పీఏసీఎస్లు, ఆప్కాబ్ బ్యాంకులు ఇందుకు సహకరించాలని కోరారు. వీటి ద్వారా కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని, ఆర్బీకేల ద్వారా రుణాలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించాలని సీఎం జగన్ సూచించారు.