in ,

విజయవాడ లో 12.97కిలోల బంగారం స్వాధీనం!

దాదాపు రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను విజయవాడ రైల్వే స్టేషన్ వద్దకస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విషయం ఏంటంటే తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా బంగారం తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందడంతో విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద నిఘా పెట్టారు.

తొలుత ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 5కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వారు అందించిన సమాచారంతో మరికొందరిని అదుపులోకి తీసుకుని 7.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన బంగారంలో కొంత బిస్కెట్ల రూపంలో, మరికొంత ఆభరణాల రూపంలోను ఉన్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

What do you think?

గ్రామ సింహానికి భయపడిన అడవి సింహం.వైరల్ విడియో!

వందేభారత్ను వేగంగా విస్తరిస్తున్న ఇండియన్ రైల్వే.