in

ప్రసవం జరిగిన నెలలోనే ప్రజల పని.. మేయర్ ఆర్య

ప్రసవం జరిగిన నెలలోనే ప్రజల పని.. మేయర్ ఆర్య

అతి పిన్న వయసులోనే మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్య రాజేంద్రన్ మరో సారి వార్తల్లో నిలిచారు. ప్రసవం జరిగి నెలలో కార్యాలయంలో కనిపించి ప్రశంసలు అందుకున్నారు.

ఆర్య రాజేంద్రన్ 2020లో 21 సంవత్సరాల వయసులోనే తిరువనంతపురం మేయర్ గా బాధ్యతలు చేపట్టారు. అతి పిన్న వయసులోనే మేయర్ గా ఎన్నికై యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సచిన్ దేవ్ను పెళ్లి చేసుకున్నారు. సచిన్ దేవ్ కూడా అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కాగా ఈ దంపతులకు గత నెల ఆగస్టు 10న ఓ పాప పుట్టింది. అయితే ప్రసవం జరిగి నెల దాటిందో లేదో.. ఆర్య రాజేంద్రన్ తన పాపను ఎత్తుకొని కార్యాలయానికి వెళ్ళారు.

బుజ్జాయిని ఒడిలో పెట్టుకునే పెండింగ్ దస్త్రాలను పరిశీలించారు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

దీంతో బిడ్డకు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇటు ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తోందని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.

What do you think?

కిలో టమాట 50 పైసలకే.. మళ్ళీ మొదలైన రైతుల తిప్పలు.

‘బిచ్చగాడు’ హీరో విజయ్ పెద్ద కుమార్తె ఆత్మ హత్య