in

గొడ్డళ్లతో దాడి చేసుకున్న రైతులు.భూ వివాదమే కారణం!

గొడ్డళ్లతో దాడి చేసుకున్న రైతులు. భూ వివాదమే కారణం!

 

తెలంగాణలోని కొమురం భీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రైతుల మధ్య చెలరేగిన వివాదం ముగ్గురి ప్రాణాలు తీసింది.

వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన రెండు వర్గాల రైతుల మధ్య గట్టు విషయంలో వివాదం చెలరేగింది. దీంతో ఇరువర్గాలకు చెందిన రైతులు కత్తులు, గొడ్డళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ మహిళ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 15 మంది దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.

కాగా దీనికి సంభందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

What do you think?

‘నా రెడీ’ పాట వల్ల దళపతి విజయ్ పై కేసు నమోదు.

‘నా భర్త ప్రాణాలకు హాని ఉంది.’ – ఈటెల జమున