టీమిండియాకు కొత్త కెప్టెన్.. అయ్యర్ కు ఛాన్స్
టీమిండియాకు కొత్త కెప్టెన్ ను నియమించాలని బీసీసీఐ యోచిస్తోందట. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అర్హుడని భావిస్తోందట.
అయ్యర్కు కెప్టెన్సీ పరంగా ఇంతకు ముందు అనుభవం ఉంది. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు అయ్యర్ నాయకత్వం వహించాడు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అతడికి టీిండియా టెస్ట్ కెప్టెన్సీ అప్పగించాలని బీసీసీఐ నిర్ణయించిందట.
అయితే అయ్యర్ ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నాడు.