ఎంపీ నిధులతో ఇళ్లు కట్టుకుంటే తప్పేంటి-బీజేపీ ఎంపీ
బీజేపీ అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ ఎంపీ ల్యాడ్స్ నిధులతో తాను ఇల్లు కట్టుకున్నానని అన్నారు. ఆ ఇంట్లోనే తన కుమారుడి పెళ్లి కూడా చేశానని తెలిపారు.
ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పేసిన ఎంపీ బాపూరావ్ ఎంపీ ల్యాడ్స్ నిధులతో తాను ఇల్లు కట్టుకుంటే తప్పేంటని అన్నారు. సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదని.. అందుకే ఇలా ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఇల్లు కట్టుకున్నానని చెబుతూ తన మాటల్ని సమర్థించుకున్నారు. ఆ నిధులతో కట్టుకున్న ఇంట్లోనే తన కుమారుడి పెళ్లి కూడా చేశానని తెలిపారు. అభివృద్ధి కోసం నిధులు పంచకపోవడం తప్పే. కానీ గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా తాను నిధులు గోల్మాల్ చేయలేదని ఎంపీ సోయం బాపూరావ్ చెప్పుకొచ్చారు.
కాగా ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు బాపూరావ్ కు నిధులు సొంత అవసరాలకు వాడుకోడానికి పై అధికారులు ఎలా ఆమోదించారని కొందరు ప్రశ్నిస్తుండగా.. ఇంకొందరు ఈ పని అపోజిషన్ వాళ్లలో ఎవరైనా చేసుంటే సెంట్రల్ వెంటనే విచారణ ప్రారంభించేదని కామెంట్ చేస్తున్నారు.
ఎంపీ ల్యాడ్స్ నిధులతో నేను ఇల్లు కట్టుకున్నా, నా కుమారుడి పెళ్లి చేశా – బీజేపీ ఎంపీ సోయం బాపూరావ్
అదిలాబాద్ – ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంత అవసరాలకు వాడుకుంటే తప్పేంటని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావ్ అన్నారు.
సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదనే కారణంతో ఎంపీ నిధులతో నేను ఇల్లు… pic.twitter.com/NSj1tDOi4V
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2023