in

ఎంపీ నిధులతో ఇళ్లు కట్టుకుంటే తప్పేంటి-బీజేపీ ఎంపీ

ఎంపీ నిధులతో ఇళ్లు కట్టుకుంటే తప్పేంటి-బీజేపీ ఎంపీ

 

బీజేపీ అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ ఎంపీ ల్యాడ్స్ నిధులతో తాను ఇల్లు కట్టుకున్నానని అన్నారు. ఆ ఇంట్లోనే తన కుమారుడి పెళ్లి కూడా చేశానని తెలిపారు.

ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పేసిన ఎంపీ బాపూరావ్ ఎంపీ ల్యాడ్స్ నిధులతో తాను ఇల్లు కట్టుకుంటే తప్పేంటని అన్నారు. సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదని.. అందుకే ఇలా ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఇల్లు కట్టుకున్నానని చెబుతూ తన మాటల్ని సమర్థించుకున్నారు. ఆ నిధులతో కట్టుకున్న ఇంట్లోనే తన కుమారుడి పెళ్లి కూడా చేశానని తెలిపారు. అభివృద్ధి కోసం నిధులు పంచకపోవడం తప్పే. కానీ గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా తాను నిధులు గోల్‌మాల్‌ చేయలేదని ఎంపీ సోయం బాపూరావ్ చెప్పుకొచ్చారు.

కాగా ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు బాపూరావ్ కు నిధులు సొంత అవసరాలకు వాడుకోడానికి పై అధికారులు ఎలా ఆమోదించారని కొందరు ప్రశ్నిస్తుండగా.. ఇంకొందరు ఈ పని అపోజిషన్ వాళ్లలో ఎవరైనా చేసుంటే సెంట్రల్ వెంటనే విచారణ ప్రారంభించేదని కామెంట్ చేస్తున్నారు.

What do you think?

ఫేస్‌బుక్‌ ను ముప్పు తిప్పలు పెట్టాడు

టీమిండియాకు కొత్త కెప్టెన్.. అయ్యర్‌ కు ఛాన్స్