సామాన్యుడికి భారం కానున్న చక్కెర ధర
నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ సమయంలో ఇప్పుడు చక్కెర ధరలు కూడా భారీ పెరిగిపోతున్నాయి. చెరకు ఉత్పత్తిపై వాతావరణం ప్రభావం ఉండడంతో ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. చెరుకు ఎక్కువగా పండించే కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వర్ష భావ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని మొత్తం చక్కెర ఉత్పత్తిలో ఈ రాష్ట్రాల వాటా 50% ఉంది. దీంతో చక్కెర ఉత్పత్తి బాగా తగ్గింది.
కాగా రిటైల్ మార్కెట్లో కేజీ చక్కెర ధర రూ.50 వరకు పలకుతుండగా.. ఈ ధరల పెరుగుదల మరో 2-3 నెలల పాటు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.