in ,

చంద్రబాబును చంపే ప్రయత్నం జరుగుతోంది – ఎంపీ రఘు రామకృష్ణ

చంద్రబాబును చంపే ప్రయత్నం జరుగుతోంది – ఎంపీ రఘు రామకృష్ణ

ఎంపీ రఘు రామకృష్ణ రాజు చంద్రబాబుకు ప్రాణ హాని పొంచి ఉందని అన్నారు. ఆయన్ను జైలులో హత్య చేయాలని పథక రచన చేశారని ఆరోపించారు.

సోమవారం ఢిల్లీలో వైకాపా ఎంపీ రఘు రామకృష్ణరాజు విలేకర్లతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత చంద్రబాబుపై మోపిన కేసులో పస లేదని.. కేవలం నస, కసి మాత్రమే ఉన్నాయని అన్నారు. చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వక ముందే ఆ నగరంలో 144 సెక్షన్ విధించడం, రహదారిని క్లియర్ చేయడం వంటి ఘటనలు పరిశీలిస్తే తీర్పు ఏమిటో ప్రభుత్వానికి ముందే తెలుసనే భావన నెలకొందన్నారు. చంద్రబాబును చంపే ప్రయత్నం జరుగుతోందని రఘు రామ కృష్ణ ఆరోపించారు. గతంలో మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో సాక్ష్యాలు రూపుమాపేందుకు జైలులోనే హత్య చేసిన ఘటనలున్నాయని పేర్కొన్నారు.

చంద్రబాబును కూడా గుంటూరు జైల్లో హత్య చేయాలని పథక రచన చేశారని, వేంకటేశ్వర స్వామి దయ, సుప్రీంకోర్టు తీర్పు వల్లే ఆయన బ్రతికి బయటపడ్డానని అన్నారు. ఇంకో 3-4 రోజులు జైలులోనే ఉంటే తనను కచ్చితంగా హత్య చేసి ఉండేవారన్నారు.

ఇక నైపుణ్య శిక్షణ కోసం గత ప్రభుత్వం కేవలం రూ.370 కోట్లు మాత్రమే విడుదల చేస్తే అందులో రూ.550 కోట్ల అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం పేర్కొనడం అర్థరహితమని ఎంపీ రఘు రామ కృష్ణ అన్నారు.

What do you think?

కార్డు, ఫోన్ అవసరం లేకుండానే ఫ్యూయల్ చెల్లింపులు

సామాన్యుడికి భారం కానున్న చక్కెర ధర