కేరళలో కలవర పెడుతున్న నిఫా వైరస్
కేరళలో బంగ్లాదేశ్ వేరియంట్ కలవరం రేపుతోంది. నిఫా వైరస్ వ్యాప్తి కారణంగా 7 గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
అక్కడ పాఠశాలలు, బ్యాంకులు మూసివేసింది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ మరింత ప్రబలకుండా కట్టడి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ముందు జాగ్రత్తగా కేరళలోని గామాల్లో బ్యాంకులు, పాఠశాలతో పాటు ఇతర విద్యాసంస్థలను మూసివేశారు.