in

పెళ్ళికి నిరాకరించిందని హతమార్చిన ప్రియుడు

పెళ్ళికి నిరాకరించిందని హతమార్చిన ప్రియుడు

ఓ కాలేజీ విద్యార్థినిని రాడ్డుతో కొట్టి హత మార్చారు. ఈ ఘటన ఢిల్లీలోని మాళవ్య నగర్‌లోని అరబిందో కాలేజీ సమీపంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని కమలా నెహ్రూ కాలేజీలో చదువుతున్న నర్గీస్ అనే 25 ఏళ్ల యువతిని ఆమె దూరపు బంధువైన ఇర్ఫాన్‌ పెళ్లి చేసుకోవలనుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె కుటుంబానికి చెప్పాడు. కానీ ఇర్ఫాన్‌ కి ఉద్యోగం ఏమీ లేకపోవడంతో నర్గీస్ కుటుంబం అతనితో పెళ్లికి నిరాకరించింది. దీంతో నర్గీస్, ఇర్ఫాన్‌ తో మాట్లాడడం, అతని కాల్స్ కి రెస్పాండ్ అవ్వడం మానేసింది.

అయితే నర్గీస్ ఇలా తనను అవాయిడ్ చేస్తుండడంతో ఇర్ఫాన్‌ కలవరపడ్డాడు. తనకు నర్గీస్ దక్కదేమో అన్న భయంతో ప్లాన్ చేసి, ఢిల్లీలోని మాళవ్య నగర్‌లోని అరబిందో కాలేజీ సమీపంలోని పార్కు వద్దకు నర్గీస్ ను తీసుకువచ్చి రాడ్డుతో కొట్టి హత మార్చాడు.
మాలవీయ నగర్‌లోని అరబిందో కళాశాల సమీపంలో మృతదేహం ఉందని సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పొలీసులు మృతదేహం పక్కన రాడ్డుని గుర్తించారు. ఆ తరువాత విచారణలో విషయం తెలుసుకుని నిందితుడు ఇర్ఫాన్‌ ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై దక్షణ డిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ చందన్ చౌదరి మాట్లాడుతూ “తనతో పెళ్లికి నిరాకరించడంతో కలవరపడ్డ నర్గీస్ దూరపు బంధువు ఇర్ఫాన్ ఆమెను హత మార్చాడు.” అని వెల్లడించారు.

ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ సంఘటనపై స్పందిస్తూ “మాల్వీయా నగర్ వంటి నాగరిక ప్రాంతంలో, ఒక అమ్మాయిని రాడ్‌తో కొట్టి చంపారు. ఢిల్లీ చాలా ప్రమాదకరమైన ప్రదేశం. కానీ ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. వార్తాపత్రికలలో అమ్మాయిల పేర్లు దాస్తారు, వాళ్ళ పేర్లు మర్చుతారు. కానీ ఈ నేరాలు మాత్రం ఆగవు.” అంటూ ట్వీట్ చేశారు.

What do you think?

ఐఫోన్ 14 కోసం 8 ఏళ్ల బిడ్డను అమ్ముకున్న జంట

నకిలీ జడ్జిగా మోసాలు.. ఆట కట్టించిన పోలీసులు