ఐఫోన్ 14 కోసం 8 ఏళ్ల బిడ్డను అమ్ముకున్న జంట
ఓ జంట ఐఫోన్ కోసం 8 ఏళ్ల బిడ్డను అమ్ముకున్నారు. నెల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కోల్కతా సమీపంలోని పానిహతి గంగా నగర్ కు చెందిన ఓ జంట ఇన్స్టా లో రీల్స్ ( insta reels) చేయడం కోసం తమ 8 ఏళ్ల బాబుని అమ్మేసి, ఐ ఫోన్ 14 కొనుగోలు చేశారు.
కాగా కొన్ని వారాలుగా ఆ బిడ్డ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టు పక్కల వాళ్ళు ఈ నెల 24న పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐఫోన్ కోసం బిడ్డను అమ్ముకున్నట్టు తెలుసుకున్నారు.
అయితే తండ్రి పోలీసులకు ఈ విషయం తెలిసి పోయిందని తెలుసుకుని అక్కడి నుంచి పారారయ్యాడు.
కాగా ఆ తల్లిని విషయం తెలుసుకున్న వెంటనే అదుపులోకి తీసుకున్న పొలీసులు ప్రస్తుతం తండ్రి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.