ఒక వైపు నిఫా వైరస్.. మరో వైపు ‘స్క్రబ్ టైఫస్’
ఒక వైపు కేరళలో నిఫా వైరస్ వణికిస్తున్న ఈ సమయంలో మరో వైపు ఒడిశా రాష్ట్రంను ‘స్క్రబ్ టైఫస్’ వణికిస్తోంది. తాజాగా సుందర్గఢ్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 180 కి చేరుకుంది.
ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న 59 మంది శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 11 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
ఎవరికైనా నాలుగు, ఐదు రోజులుగా జ్వరంతో బాధ పడుతుంటే వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.