తెలంగాణా గాయకుడు గద్దర్ ఇక లేరు
ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు (06/08/23) మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్ల మంది ప్రజలను ఉత్తేజ పరిచిన గద్దర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఇటీవల గుండెపోటు రావడంతో ఆయన్ను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. చివరికి ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు (06/08/23) తుదిశ్వాస విడిచారు.