దళితులన్న కారణంతో క్షవరం చేసేందుకు నిరాకరిస్తున్నారు
సిద్దిపేట జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో దళితులకు కటింగ్ చేసేందుకు నాయీ బ్రాహ్మణులు నిరాకరిస్తున్నారు. కొన్నాళ్లుగా హెయిర్ సెలూన్లలో వేరే కులస్తులక షాపులో కటింగ్ చేస్తూ దళితులకు మాత్రం చెట్టు కింద చేస్తన్నారు. ఈ విషయంపై దళిత కుటుంబాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దళితులన్న కారణంతోనే వారికి క్షవరం చేసేందుకు సెలూన్ షాప్ యజమానులు నిరాకరిస్తున్నారని తెలిపారు. దళితుల భాద విన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.