మన దేశంలో అవినీతి జరగని జాగా లేదంటే అది అతిశయోక్తి కాదేమో. పోలీస్ శాఖలో అవినీతి, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, ఆర్.టీ.ఓ(R.T.O) ఆఫీస్ లో అవినీతి. ఇలా చెప్పుకుంటూ పోతే అవినీతి జరిగే ప్రదేశాలు చాలానే ఉంటాయి. వీటిలో పేదల రేషన్ కూడా మినహాయింపేమీ కాదు. ఇప్పుడు ఇలాంటి ఒక సంఘటనే వెలుగులోకి వచ్చింది.
విజయనగరం జిల్లా కేంద్రంలో ట్రక్ ఆటోలో కొంత మంది రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పౌరసరఫరాలు,విజిలెన్స్ అధికారులు ఈ నెల 5న పట్టుకున్నారు.దాదాపుగా 1000 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని వారు సొంతం చేసుకున్నట్టుగా సీ.ఎస్.డీ.టీ జగన్నాథ రావు,తహసీల్దార్ చింత బంగారు రాజులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విధంగా అక్రమంగా బియ్యాన్ని ఎవరైనా అమ్మినా, లేదా కొనుగోలు చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతూ ఇలా చేసే వారిని హెచ్చరించారు.