పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించనున్న కేంద్రం
రక్షా బంధన్ సందర్బంగా సిలిండర్ పై రూ.200 తగ్గిస్తూ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని భావిస్తుందట. మరో ఐదు నెలల్లో తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లలో ఎన్నికలు జరగనున్నాయన్న విషయం తెలిసిందే. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ సర్కార్ ఇలా సిద్దం అవుతోందని సమాచారం. దీని కోసం ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.