దేశంలో భారీగా పెరిగిపోయిన పసిడి ధర
దేశంలో పసిడి ధరలు భారీగా పెరిగిపోయాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల గోల్డ్ ధరపై వరుసగా రూ.300, రూ.330 చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 చేరింది. అటు ముంబయి, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో పసిడి ధర రూ. 55,000 ఉండగా చెన్నైలో రూ. 55,300 పలుకుతోంది.
మరోవైపు వెండి ధరలు కూడా నేడు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధరపై రూ. 500 పెరిగింది. హైదరాబాద్లో రూ. 80,700 లుగా నమోదైంది.