నిఫా వైరస్ కోవిడ్ కంటే చాలా ప్రమాదకరం – ఐసీఎంఆర్
కేరళలో కలవరం సృష్టిస్తున్న నిఫా వైరస్ కోవిడ్ కంటే చాలా ప్రమాదకరమని ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.
కోవిడ్ సోకిన వారిలో 2-3 శాతం మరణాలే సంభవిస్తాయని, కానీ నిఫా వైరస్ వల్ల 40-70 శాతం మరణాలు సంభవిస్తాయని పేర్కొంది.
ఇక కేరళలో నిఫా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరగా.. కేసుల పెరుగుదలపై ఇంకా సరైన కారణాలు తెలియదని ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బాల్ అన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు డీజీ తెలిపారు.