ముంబై హోటల్లో దంపతుల భోజనంలో ఎలుక
భోజనం కోసం హోటల్ కు వెళ్లిన దంపతుల భోజనంలో ఎలుక వచ్చింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే ముంబైలోని ప్రముఖ పాపా పంచో రెస్టారెంట్ కి దంపతులు భోజనం కోసం వెళ్లారు. వాళ్లు అక్కడ రోటీ, చికెన్ , మటన్ కర్రీలను ఆర్డర్ చేశారు. అయితే వారు భోజనం చేస్తుండగా ఒక ముక్క వింతగా కనిపించడంతో దాన్ని బాగా పరిశీలించగా అది చనిపోయిన ఎలుక అని తెలిసి ఖంగుతిన్నారు.
దీంతో వెంటనే ఆ దంపతులు బాంద్రా పోలీసు స్టేషన్ లో ఈ విషయాన్ని ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనతో ముంబై పలు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు ప్రారంభించారు.