వేలంలో రూ.9.14 కోట్లు పలికిన బ్రిటిష్ యువరాణి స్వెటర్!
దివంగత బ్రిటిష్ యువరాణి డయానా స్వెటర్ రూ.9.14 కోట్లు పలికింది. సోథ్బీ సంస్థ నిర్వహించిన వేలంలో ఓ వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే తాజాగా ప్రముఖ సోథ్బీ సంస్థ ఆన్లైన్ ఫ్యాషన్ ఐకాన్ సేల్ వేలం నిర్వహించింది. ఈ వేలంలో దివంగత బ్రిటిష్ యువరాణి డయానా ధరించిన స్వెటర్ ఒకటి రికార్డు స్థాయిలో రూ.9.14 కోట్లు పలికింది. ఆ స్వెట్టర్ ను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రూ.9,14,58,510 కి సొంతం చేసుకున్నారు.
కాగా ఇదే ఏడాది జనవరిలో సోథ్బీ సంస్థ నిర్వహించిన వేలంలో డయానా ధరించిన బాల్ గౌన్ సైతం రూ.5 కోట్లకు పైగా పలికింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ గా అవుతోంది.