in

ముగిసిన వైసీపీ ఎంపీ భార్యా,కుమారుడి కిడ్నాప్ డ్రామా

ముగిసిన వైసీపీ ఎంపీ భార్యా,కుమారుడి కిడ్నాప్ డ్రామా

 

వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల్ని కొందరు అపహరించారు. వ్యాపార లావా దేవీల నేపథ్యంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు సమాచారం.

వివరాల్లోకి వైసీపీ ఎంపీ సత్యనారాయణ నగరంలో లేని సమయంలో ఆయన భార్య ఆనందపురంలో ఉన్న తమ కొడుకు దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో అయన భార్యను, కుమారుడిని కొందరు అపహరించారు. ఈ విషయం తెలిసి వారి సన్నిహితుడు, ఆడిటర్ అయిన గన్నమనేని వెంకటేశ్వర రావు (జీవీ) అక్కడికి వెళ్లగా.. ఆయనను కూడా కిడ్నాప్ చేసి అందర్ని ఓ ఇంట్లో నిర్బంధించారు. ఈ కిడ్నాప్ రియల్ ఎస్టేట్ వ్యాపార లావా దేవీల నేపథ్యంలో జరిగినట్లు తెలుస్తుండగా.. నిందితులు 50 కోట్లు డిమాండ్ చేశారని సమాచారం.

అయితే బుధవారం జరిగిన ఈ ఘటనను పోలీసులు ఇప్పటి వరకు గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఈ విషయం బయటకి పొక్కడంతో పోలీసులు స్పందించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, ఆడిటర్ అందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపారు.

ప్రధాన నిందితుడు హేమంత్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాపర్ల పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు.

What do you think?

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 37వ స్థానంలో రహానే!

ఫేస్బుక్ కార్యకలాపాలు నిలిపివేస్తాం – హైకోర్ట్ హెచ్చరిక!