in

ఉత్తరప్రదేశ్ లో దేవుడికి తల అర్పించబోయిన వ్యక్తి

దేవుడికి తల అర్పించబోయిన వ్యక్తి

ఓ వ్యక్తి దేవుడికి నైవేద్యంగా తన తలను సమర్పించడానికి యత్నించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లలిత్పుర్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే దీపక్ కుశ్వాహా అనే వ్యక్తి లలిత్పుర్ జిల్లాలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నాడు.

దీపక్ దేవుడి భక్తుడిగా చెప్పుకుంటూ నిత్యం వివిధ రకాల పూజలు చేస్తుండేవాడు. అయితే గత కొన్ని నెలలుగా దీపక్ తన తలను బలి ఇచ్చి దేవుణ్ని ప్రసన్నం చేసుకుంటానని ఊర్లో తెలిసిన వారితో చెబుతూ వచ్చాడు. తలను బలివ్వడం గురించి, దేవుని ప్రార్థనల గురించి దీపక్ ఓ నోట్ బుక్ లో కూడా రాసుకున్నాడు.
ఈ విషయం తెలిసిన దీపక్ తండ్రి పాల్తూరామ్ బలిదానం పిచ్చిపని దీపక్ ను మందలించడానికి ప్రయత్నించాడు. కానీ దీపక్ ఆ మాటలను పట్టించుకోలేదు. పైగా తనకు యాగం చేయాలని ఉందని కొన్ని రోజులుగా తండ్రికి చెబుతూ వచ్చాడు.

అయితే ఈ మంగళవారం (15-08-23) ఉదయాన్నే స్థానిక ఆలయానికి వెళ్లిన దీపక్ హోమ గుండం ఎదుట నిల్చొని దేవుణ్ని స్తుతిస్తూ చెట్లు నరికే యంత్రంతో తల కోసుకోడానికి యత్నించాడు. కాగా ఆ సమయంలో బాధతో దీపక్ రావడంతో చుట్టు పక్కలున్న స్థానికులు పరిగెత్తుకుంటూ గుడి దగ్గరకు వచ్చారు. అప్పటికే అతడు రక్తపు మడుగులో కనిపించడంతో భయాందోళనకు గురైన స్ధానికులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియ చేశారు. వారు వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దీపక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

What do you think?

స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా 4లక్షలు కొట్టేశారు

ప్రియుడి కోసం వేల కోట్లు వదిలేసుకున్న ప్రేయసి