విమానాశ్రయంలో 47 కొండచిలువలను తరలిస్తున్న వ్యక్తి
అక్రమంగా కొండచిలువలను తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే మలేషియాకు చెందిన మహమ్మద్ మొయిదీన్ అనే వ్యక్తి తనతో పాటు 47 కొండచిలువలు అక్రమంగా భారత్కు తీసుకువచ్చాడు. అయితే అతడి బ్యాగ్ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో కొండచిలువలు బయటపడ్డాయి. దీంతో షాకైన అధికారులు వెంటనే మహమ్మద్ను అదుపులోకి తీసుకున్నారు.
మరో వైపు ఈ ఘటనకు సంభందించిన కొన్ని ఫోటోలు నెట్టింట అప్లోడ్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.