in

చిరుతతో పోరాడి అధికారులకు అప్పగించాడు!

చిరుతతో పోరాడి అధికారులకు అప్పగించాడు!

 

ఓ వ్యక్తి పులితో పోరాడి మట్టుపెట్టి తాళ్లతో కట్టేశాడు. ఆ తరువాత పులిని తీసుకువెళ్ళి అధికారులకు అప్పగించాడు. దీంతో ఇది ఇప్పుడు వైరల్ గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని హసన్ జిల్లా బాగివలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ బైక్ పై పొలానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో అతనికి ఓ చిరుత పులి ఎదురయ్యింది. ఏం చేయాలో తెలియక అదే వెళ్లి పోతుందని అక్కడే చూస్తూ ఉన్న వేణుగోపాల్ పై చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసింది. దీంతో తప్పించుకునే మార్గం లేక అతడు పులిపై ఎదురుదాడికి దిగాడు. తన బలాన్ని మొత్తం ప్రయోగించి పోరాడి చాకచక్యంగా ఆ చిరుతను బంధించాడు. తరువాత ఆ పులిని తన బైక్ పై తాళ్లతో కట్టి తీసుకువెళ్లి ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు. అతడి దైర్యం చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. మరో వైపు ఇది వైరల్ గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

What do you think?

దారుణానికి వడిగట్టిన తల్లి. కూతుళ్లను భర్త పరం..

వ్యాపారం అభివృద్ధి చెందాలా? అయితే ఇది చదవండి