భోజనంలో బల్లి. 110 విద్యార్థులకు అస్వస్థత
ఓ పాఠాశాలలో పిల్లల భోజనంలో బల్లి పడింది. దీంతో 110 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్ పాకూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠాశాలలో కొందరు విద్యార్థులు రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, తలనొప్పితో బాధ పడ్డారు. మొత్తం 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో బయటపడిన సిబ్బంది వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొందరు చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యారు.
కాగా భోజనంలో బల్లి పడడంతోనే ఇలా జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. అయితే అసలు కారణం ఏంటో ఇంకా తెలియదని, పూర్తి విచారణ చేయాలని అధికారులు పేర్కొన్నారు.