in ,

కొడాలి నాని పై సునిల్ దేవ్ సంచలన వ్యాక్యలు..

కొడాలి నాని పై బీజేపీ కో ఇంఛార్జి సునిల్ దేవ్ సంచలన వ్యాక్యలు

 

బీజేపీ కో ఇంఛార్జి సునిల్ దేవ్ ధర్ ఏపీ ప్రభుత్వం పై మండి పడ్డారు. ఈ క్రమంలో ఆయన కొడాలి నాని పై సంచలన వ్యాక్యలు చేశారు. కొడాలి నాని గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్నారని.. ఆయనను అసెంబ్లీ గడప తొక్కకుండా గుడివాడ ప్రజలు చూడాలని సునిల్ దేవ్ అన్నారు.

 

ఏపీ: ఇటీవల గుడివాడ సమస్యలపై నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన సునిల్ దేవ్ ధర్, జగన్ పాలనను అంతం చేయడానికి జనసేన-బీజేపీ కలిసి పోరాటం చేస్తున్నాయని అన్నారు. జగన్ ఏపీని సర్వనాశనం చేస్తున్నారని సునిల్ దేవ్ మండి పడ్డారు. శిక్షపడిన ఖైదీ, బూతుల ఎమ్మెల్యేల పాలనలో ఏపీ పరిస్థితి దారుణంగా మారిందని విమర్శించారు. ప్రకృతి కారణంగా 45 డిగ్రీల వేడి ఉంటే జగన పాలనలో అంతకంటే వేడి ఉందని సునిల్ దేవ్ ఎద్దేవా చేశారు.

ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని లాంటి వారిని జైలుకు పంపిస్తామని, కొడాలి నాని మాటలతో రాష్ట్రం పరువు పోతుందని సునిల్ దేవ్ అన్నారు. సంక్రాంతికి క్యాసినో, క్యాబరే డ్యాన్సులుగా మార్చారని, గుడివాడ యువతను ఆయన సర్వనాశనం చేస్తున్నారని.. కొడాలి నానిని అసెంబ్లీ గడప తొక్కకుండా గుడివాడ ప్రజలు చూడాలని సునీల్ దేవ్ ధర్ కొడాలి నాని పై సంచలన వ్యాక్యలు చేశారు.

What do you think?

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్!

కూతురి మృత దేహం బండి మీద. కరుణించని అధికారులు..