in ,

పెట్రోల్ ధరలను జిఎస్టీలోకి తెస్తాం-మంత్రి నిర్మలా

ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్ ధరల నియంత్రణ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇంధన ధరలను జీఎస్టి పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీహెచీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులతో బడ్జెట్ అనంతర చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వస్తు, సేవల పన్ను (జిఎస్టి) పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొచ్చే అంశంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ “రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే అది సాధ్యమవుతుంది” అన్నారు.

ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడిన నిర్మలా సీతారామన్ “దేశవృద్ధి కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. తాజా బడ్జెట్లో మూలధన వ్యయాన్ని 33శాతం పెంచి రూ.10లక్షల కోట్లకు చేర్చాం, కేంద్ర విద్యుత్ సహా పలు రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను రాష్ట్రాలు కూడా అమలు చేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నాం” అని అన్నారు.
దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నప్పటికీ.. చాలా వరకు రాష్ట్రాల్లో వాటి ధరలు రూ.100 దరిదాపుల్లో, కొన్ని చోట్ల వంద పైనే ఉంటూ ప్రజలకు భారంగా మారాయి. ఇలా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో.. వీటిని జీఎస్టి పరిధిలోకి తెచ్చి నియంత్రించాలనే కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐతే ఇందుకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ఇప్పటివరకు జీఎస్టీ మండలిలో దీనిపై ఎలాంటి చర్చలు జరగలేదు. మరోవైపు పెట్రోల్ను జీఎస్టి పరిధిలోకి తెస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతుందని, రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

What do you think?

మళ్ళీ పెళ్ళి పీటలెక్కిన హార్దిక్ పాండ్య!

పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్!