in

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మృతదేహాల కలకలం!

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మృతదేహాల కలకలం!

 

ఉమ్మడి కృష్ణాజిల్లాలో రెండు మృత దేహాలు కలకలం సృష్టించాయి. పోలీసులు ఈ మృతదేహాలు ఎవరివనే విషయం చేదించడానికి ప్రయత్నిస్తున్నారు.

 

వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం సవారీ గూడెంలో రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి.

ఈ రెండు మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో లభ్యం అయ్యాయి. వీరిద్దరిలో ఒకరికి 70 ఏళ్లు, ఇంకొకరికి 30 ఏళ్ళ వయసు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే వీరు ఎవరు?, ఏ ప్రాంతానికి చెందిన వారు అన్న విషయం పై ఇంకా స్పష్టత రావల్సి ఉండగా..

వీరిద్దరు ఆత్మ హత్య చేసుకున్నారా? లేక ఎవరైనా వీరిని హత్య చేశారా? అన్న దాని పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

What do you think?

రూ.2 వేల నోట్ల మార్పిడి పై ఎస్బీఐ తీపికబురు!

13 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో కన్నుమూత!