సైబర్ నేరగాళ్లకు కోటిన్నర సమర్పించుకున్నఓ యువతి
సైబర్ నేరగాళ్లకు ఓ యువతి రూ.కోటిన్నర సమర్పించుకుంది. చివరికి మోస పోయాయని తెలుసుకుని పోలీసులకు పిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే సైబర్ నేరగాళ్లు ఇన్స్టాగ్రామ్లో తాము సూచించిన పేజీలకు రేటింగ్ ఇవ్వాలంటూ హైదరాబాద్ కు చెందిన ఓ మహిళను సంప్రదించారు. ఆమె వారిని పూర్తిగా నమ్మిన తర్వాత తమతో పాటు పెట్టుబడి పెడితే ఆమె కూడా డబ్బు సంపాదించవచ్చంటూ మాయమాటలు చెప్పారు. ఆ మాటలు నమ్మిన యువతి పెట్టుబడి పెట్టింది. విడతల వారీగా కేటుగాళ్లకు రూ. 1.50 కోట్లు సమర్పించుకుంది. అలా అంతా పోగొట్టుకున్న తరువాత చివరికి వాళ్ళు తనను మోసం చాసారని గ్రహించింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి సైబర్ నేరగాళ్ల పై ఫిర్యాదు చేసింది.