in

గాలి జనార్ధన్ కు షాక్ ఇచ్చిన సీబీఐ స్పెషల్ కోర్ట్

గాలి జనార్ధన్ కు షాక్ ఇచ్చిన సీబీఐ స్పెషల్ కోర్ట్

 

జనార్దన్ రెడ్డికి సీబీఐ స్పెషల్ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన ఆస్తులను జప్తు చేయాలంటూ ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే మైనింగ్ కింగ్, కర్ణాటక, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి చెంధిన 100 ఆస్తులను సీబీఐ జప్తు చేసింది. జనార్ధన్ రెడ్డికి కర్నాటక, తెలంగాణలో ఇళ్లు, ఇంటి స్థలాలు, ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించిన దర్యాప్తు బృందం ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన భార్య అరుణ పేరు మీద ఉన్న 124 ఆస్తుల్లో 100 ఆస్తులను జప్తు చేయాలని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.65 కోట్లు ఉంటుందని అంచనా.

అయితే ఈ విషయం పై స్పందించిన గాలి జనార్ధన్ గతంలో కూడా తనకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని.. అప్పుడు న్యాయ పోరాటం చేసి ఆస్తులను తిరిగి తన సొంతం చేసుకున్నానని పేర్కొన్నారు.

What do you think?

సీఎం జగన్ పై రామ్ గోపాల్ వర్మ సినిమా!

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 37వ స్థానంలో రహానే!