in

పెళ్లి కూతురు కట్నం ఇవ్వలేదని వెళ్ళిపోయిందా..?

ఇస్తానన్న కట్నం ఇవ్వనప్పుడు పీటల మీదనుంచి లేచి వెళ్ళిపోయిన వరుడ్ని చూసుంటారు. ఇచ్చిన కట్నం సరిపోలేదని పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోయిన వరుడ్ని చూసుంటారు. కానీ కట్నం సరిపోలేదని పెళ్ళి పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోయిన వదువును చూశారా? చూడకపోతే ఇది మీరు తెలుసుకోవల్సిందే.

విషయం ఏంటంటే ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటకు చెందిన యువతితో పెళ్ళి కుదిరింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్ళికొడుకుకి కట్నం ఇచ్చేదిపోయి.. పెళ్ళి కూతురికి ఎదురు కట్నంగా రూ.2 లక్షలు ఇచ్చేటట్టు కుల పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య వప్పందం జరిగింది. వాళ్ళు అంగీకరించినట్టే పెళ్ళికూతురికి రూ. 2 లక్షల కట్నం కూడా చెల్లించారు. అనుకున్నట్ట ఘట్కేసర్లోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్ళికి బంధుమిత్రు అందరినీ ఆహ్వానించారు. అయితే ఇంకొన్ని నిమిషాల్లో తాళి కట్టబోతుండగా… ఇచ్చిన కట్నం సరిపోదని, అదనపు కట్నం ఇవ్వాలని పెళ్ళి కూతురు డిమాండ్ చేసింది.

దీంతో ఏం చేయాలో తెలియని పెళ్ళికొడుకు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్లో చర్చలు కూడా జరిగాయి. కానీ పెళ్ళికూతురు, ఆమె కుటుంబ సభ్యులు కుదరదని ససేమీరా చెప్పేసారు. దీంతో ఇక చేసేదేమి లేక పెళ్ళికొడుకు, అతని కుటుంబ సబ్యులు రూ. 2లక్షలు వదిలేసుకుని వెళ్ళిపోయారు. పెళ్లి ఆగిపోయింది.

వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా..! కలికాలం అంటే ఇదేనేమో మరి.

What do you think?

అక్కడ టికెట్ కొంటారు. కానీ ప్రయాణించరు.

బాడీ బిల్డింగ్లో “గోల్డ్ మెడల్” సాధించిన ఓ గృహిణి