in

వరుడు ని వెంటాడి మరీ పెళ్లి చేసుకున్న వధువు!

వరుడు ని వెంటాడి మరీ పెళ్లి చేసుకున్న వధువు!

పారిపోతున్న వరుడుని వెంటాడి మరీ తీసుకువచ్చి పెళ్లి చేసుకుంది ఓ వధువు. ఈ వింత వ్యవహారం ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

 

వివరాల్లోకి వెళ్తే ఓ యువతి, యువకుడు ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెళ్లిగా మార్చాలని పట్టు బట్టి ఇంట్లో వాళ్ళని వప్పించారు. ఇద్దరూ పెళ్లి చేసుకోడానికి బరేలీ లోని ఆలయంలో ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

అయితే, పెళ్లికి ముహూర్తం దాటిపోతున్నా.. పెళ్లి కొడుకు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అప్పటికే ముస్తాబయి కూర్చున్న పెళ్లి కూతురు ఇక విసిగిపోయి పెళ్ళి కొడుకుకి ఫోన్ చేసింది. అతను తన తల్లిని తీసుకు రావడానికి వెళ్తున్నానని, వెంటనే తిరిగి వచ్చేస్తానని చెప్పాడు. అయితే మాటలు ఎందుకో పెళ్లి కూతురికి నమ్మ శక్యంగా అనిపించకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి అతని కోసం వెతుకులాట మొదలు పెట్టింది.

అలా వెతుకు లాడుతూ బరెలీకి 20 కిలో మీటర్ల దూరంలో భీమోర పోలీస్ స్టేషన్ వద్ద బస్సు ఎక్కుతుండగ పెళ్లి కొడుకుని పట్టుకుంది. ఆఖరికి ఏ మండపంలో నుంచి అయితే అతను పారిపోయాడో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి తాళి కట్టించుకుంది పెళ్లి కూతురు.

What do you think?

ఇంజినీర్ నుంచి 19 లక్షలు దండుకున్న సైబెర్ గాళ్ళు.

మూసీ నదిలో దొరికిన తల కేసును ఛేదించిన పొలీసులు!