ఈ సీజన్ కంటెస్టెంట్స్ వీళ్ళే! ఆసక్తికరంగా స్టార్ట్ అయిన బిగ్బాస్ 7
ప్రేక్షకులను మెప్పించి వారి మనసుల్లో చోటు సంపాదించుకున్న టీవీ షోలలో రియాలిటీ షో “బిగ్బాస్” కూడా ఒకటి. ఇప్పటికి వరకు 6 సీజన్లతో అలరించిన ఈ షో ఇప్పుడు సీజన్ 7 గా మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఆదివారం బిగ్ బాస్ ఆట మొదలైంది. “ఈ సీజన్ లో అంతా ఉల్టా పల్టా” అంటూ ఇన్ని రోజులూ ప్రేక్షకులలో ఆసక్తి పెంచిన స్టార్ హీరో అక్కినేని నాగార్జున షో మొదలవ్వగానే హౌస్ లోకి వెళ్ళి అక్కడి విశేషాలు పంచుకున్నారు. ఆ తరువాత ఈ సీజన్ 7 లో ఆడబోతున్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పరిచయం చేశారు.
అంతే కాకుండా మొదటి రోజే నాగార్జున కంటెస్టెంట్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బ్రీఫ్ కేసులో 20 లక్షలు పెట్టి “వెళ్లిపోవాలి అనుకున్న వాళ్ళు ఈ బ్రీఫ్ కేస్ తీసుకుని ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవచ్చు” అంటూ ట్విస్ట్ ఇచ్చారు. కొద్ది కొద్దిగా రూ.35 లక్షల వరకు ఆ మొత్తాన్ని పెంచారు. మొదట్లో నటుడు శివాజీ దీనిపై కొంచం ఆసక్తి చూపించినప్పటికీ ఆ తరువాత మనసు మార్చుకున్నారు.
ఇక హోస్ట్ నాగర్జున ఇప్పటివరకు వీరిని కంటెస్టెంట్స్ గా పరిచయం చేశారు.
సీరియల్ నటి – ప్రియాంక జైన్
సీరియల్ నటుడు – అమర్ దీప్
నటుడు, రాజకీయ నాయకుడు – శివాజీ
బుల్లితెర నటి – శోభా శెట్టి
సీనియర్ నటి – షకీలా
జబర్దస్త్ నటుడు, యూట్యూబర్ – టేస్టీ తేజ
సింగర్ – దామిని భట్ల
నటి – శుభశ్రీ
మోడల్ ప్రిన్స్ – యావర్
హీరోయిన్ – రతిక రోజ్
హీరో – గౌతమ్ కృష్ణ,
నటి కిరణ్ – రాథోడ్
కొరియోగ్రాఫర్ - సందీప్
యూట్యూబర్, యువ రైతు -పల్లవి ప్రశాంత్
వీళ్ళు ఆదివారం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.