in

గ్రూప్ – 2, గ్రూప్ -3 ఉద్యోగ నియామకాల్లో మార్పు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సి) నిర్వహించే గ్రూప్ – 2, గ్రూప్ -3 ఉద్యోగ నియామకాల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై ఈ గ్రూప్ – 2, గ్రూప్ -3 ఉద్యోగ నియామకానికి కంప్యూటర్ ప్రొఫిషియంట్ టెస్ట్ సర్టిఫికేట్ ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీపీఎస్సి , సాంకేతిక విద్యా మండలి నిర్వహించే సీపీటీ సర్టిఫికేట్ లేకుంటే గ్రూప్ – 2, గ్రూప్ -3 ఉద్యోగాల నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబందనలు జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారందరికీ సీపీటీ సర్టిఫికేట్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వంద మార్కులకు గానూ సీపీటీ నిర్వహించనున్నట్టు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో SC, ST, దివ్యాంగ అభ్యర్థులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుందని, కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాల్లో పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే గ్రూపు-1 ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధనలు వర్తించవంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

What do you think?

కరోనాకు భయపడి మూడేళ్ళపాటు ఇంట్లోనే గడిపిన ఓ మహిళ

నాపై “ఫెయిల్యూర్ కెప్టెన్” ముద్రవేశారు-కోహ్లీ