ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు నిషేధం.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలలో మొబైల్ ఫోన్లను నిషేధించింది.
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. టీచర్లకు ఈ నిబంధన వర్తిస్తుందని, వారు కూడా తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని సూచించింది. టీచర్లు తమ ఫోన్లను పాఠశాల హెడ్మాస్టర్కు అప్పగించాలని పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది.