in

అస్సాంలోని ఓ ఇంట్లో కలకలం రేపిన 30 నాగుపాములు.

అస్సాంలోని ఓ ఇంట్లో కలకలం రేపిన 30 నాగుపాములు.

ఒకే ఇంట్లో 30 నాగుపాములు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెల్తే అస్సాంలోని జొర్హాట్‌ జిల్లాలో హతిజురి టీ ఎస్టేటులో ఉంటున్న శంకర్‌ బనియా ఇంట్లో 30 నాగు పాములు బయటపడ్డాయి. కొద్దిరోజుల క్రితం ఆ ఇంట్లో ఓ నాగుపాము కనిపించింది. అయితే దాన్ని కుటుంబ సభ్యులు బయటకు తరిమికొట్టారు. కాగా ఆ పాము మళ్లీ ఇంట్లోకి వచ్చి ఓ గదిలోని ఫ్లోర్‌ కింద పిల్లలు చేసింది.

ప్రతి రోజు ఫ్లోర్ కింద నుంచి పాము పిల్లలు బయటకు వస్తున్నాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురై పాములు పట్టేవాడిని పిలిపించారు. అతడు గదిలోని ఫ్లోర్‌ను తవ్వి చూడగా అక్కడ 30 నాగుపాము పిల్లలను బయటబడ్డాయి.

What do you think?

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు నిషేధం.

కోడి రెట్టతో విద్యుదుత్పత్తి చేస్తున్న హర్యానా వాసి